నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్‌ కట్‌ చేసి కొత్త భవనంలోకి ప్రవేశించారు.మధ్యాహ్నం 1:20కి సచివాలయానికి చేరుకుని ప్రాంగణంలో జరుగుతున్న సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్‌. అంతకు ముందు ఉదయం నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు.నూతన సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన సీఎం చాంబర్‌లో ఆశీనులయ్యారు కేసీఆర్. సీఎం కేసీఆర్‌కు వేద పండితులు ఆశీస్సులు అందించారు. అనంతరం 6 ఫైళ్లపై కేసీఆర్‌ సంతకం చేశారు.సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్న అనంతరం పలువురు మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కార్యక్రమాలు ప్రారంభించారు. చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి, మంత్రి హరీష్‌ రావు, ఇతర మంత్రులు తమకు కేటాయించిన కొత్త ఛాంబర్లలో కొలువుదీరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed