టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్దిరోజులుగా స్టార్ హీరోస్ సినిమాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బర్త్ డేస్.. స్పెషల్ డేస్ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆరెంజ్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటివరకు అభిమానుల కోరిక మేరకే ఈ సినిమాలను నిర్మాతలే రీరిలీజ్ చేశారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ చిత్రం సింహాద్రి మూవీని ఆయన అభిమానులే సొంతంగా కొనుగోలు చేసుకుని రీరిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మూవీ విడుదల చేయగా వచ్చే కలెక్షన్స్ ను తారక్ ఫ్యాన్స్ సంక్షేమం కోసమే వాడతామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!